BJP నేత శంకర్ దారుణ హత్య

తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్‌‌కు చెందిన బీజేపీ నేత శంకర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2023-04-28 03:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్‌‌కు చెందిన బీజేపీ నేత శంకర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. శంకర్‌పై నాటు బాంబులు, కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం శంకర్‌ ఎస్సీ, ఎస్టీ విభాగం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News