రాజస్థాన్‌లో బీజేపీకి బిగ్ షాక్: ఉపఎన్నికలో రాష్ట్ర మంత్రి ఓటమి

రాజస్థాన్‌ లోని గంగానగర్ జిల్లా కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ ఓటమి పాలైంది.

Update: 2024-01-08 09:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలోని గంగానగర్ జిల్లా కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్థి సురేందర్ పాల్ సింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ కూనర్ 11,284 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గతేడాది నవంబర్ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఎలక్షన్స్ కు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ మృతి చెందాడు. దీంతో కరణ్‌పూర్ ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. తాజాగా జనవరి 5న ఎన్నిక నిర్వహించడంతో కూనర్ కుమారుడు రూపిందర్ సింగ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ప్రస్తుతం కేబినెట్‌లో చోటు దక్కిన సురేంద్ర పాల్ సింగ్‌ను బీజేపీ పోటీలో నిలపగా ఓటమి పాలయ్యాడు. ఉప ఎన్నికలో గెలుపొందిన రూపిందర్ సింగ్‌కు మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభినందనలు తెలిపారు. బీజేపీ అహంకారాన్ని ప్రజలు ఓడించారని పేర్కొన్నారు.

Tags:    

Similar News