BIG BREAKING : ఢిల్లీలో కంపించిన భూమి.. భయంతో ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం

భారత రాజధాని ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌, పంజాబ్, చండీగఢ్‌ ప్రాంతాల్లో 30 సెకన్ల పాటు భూమి కంపించింది.

Update: 2024-01-11 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత రాజధాని ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌, పంజాబ్, చండీగఢ్‌ ప్రాంతాల్లో ఇవాళ 30 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప కార్యకలాపాల పర్యవేక్షణ కోసం భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో గల భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. అనుకోని పరిణామంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం.. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంక్వా నగరాల్లో మధ్యాహ్నం 2.50 గంటలకు భూకంపం సంభవించింది.     

Tags:    

Similar News