దేశ రాజధానిలో మరోసారి సైబర్ దాడి.. హంగ్కాంగ్ నుంచి హ్యాకింగ్ ప్రయత్నం
దేశ రాజధానిలోని ఎయిమ్స్పై సైబర్ దాడి మరవకముందే మరో అటాక్ వెలుగుచూసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎయిమ్స్పై సైబర్ దాడి మరవకముందే మరో అటాక్ వెలుగు చూసింది. భారత వైద్య పరిశోధన సమాఖ్య(ఐసీఎంఆర్)పై సుమారు 6,000లకు పైగా సార్లు హ్యాకింగ్ ప్రయత్నం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత నెల 30 లోపు ఇంత సంఖ్యలో ప్రయత్నించారని తెలిపాయి. ఐపీ చిరునామా, ఇంటర్నెట్లో పరికరాన్ని గుర్తించే ప్రత్యేక చిరునామా, హాంకాంగ్లో బ్లాక్లిస్ట్లో ఉన్న అడ్రస్ను సూచించింది. అయితే ఐసీఎంఆర్ హ్యకింగ్ బారిన పడకుండా పక్కాగా ఫైర్ వాల్తో పాటు మెరుగైన భద్రతా ప్రమాణాలను కలిగ ఉన్నట్లు వెల్లడించాయి.