CM కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కుట్ర.. ఈడీ ఆరోపణలకు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైలులో
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఇంటి నుండి మామిడి పండ్లు, స్వీట్లు తెప్పించుకుని తింటున్నారని.. దీని వల్ల షుగర్ లెవెల్స్ పెంచుకుని అనారోగ్యం పేరుతో బెయిల్ పొందాలని చూస్తున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో ఈడీ వ్యాఖ్యలకు ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జైల్లో కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది.
కేజ్రీవాల్కు ఇంటి ఫుడ్ రాకుండా చేస్తున్నారని.. షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ స్వీట్స్ తింటున్నారని ఈడీ అబద్ధాలు చెబుతుందని మండిపడింది. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 13 వరకు ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులతో సమావేశాలు నిర్వహించేందుకు కేజ్రీవాల్ను అనుమతించాలని, ఈ మేరకు జైళ్ల డైరెక్టర్ జనరల్ను ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.