ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళపై కేసు నమోదు

ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లి పోలింగ్ బూత్ లో ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళపై కేసు నమోదు అయ్యింది.

Update: 2024-05-08 06:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లి పోలింగ్ బూత్ లో ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళపై కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహారాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్, ఎన్‌సీపీ నాయకురాలు రూపాలి చకంకర్ మహారాష్ట్ర, ఖడక్ వాసలా ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ కి వెళ్లారు. ఓటు వేసే ముందు ఆమె పోలింగ్ బూత్ లోని ఓ ఈవీఎంకు హారతి ఇచ్చి పూజలు జరిపారు.

దీనికి సంబందించిన ఫోటోలు నిట్టింట వైరల్ గా మారాయి. పోలింగ్ బూత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని ఆమెపై ఆ ప్రాంత ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో రూపాలీ చకంకర్ పై పూణేలోని సింహగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. దీంతో పాటు బారామతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ లోకి మరికొందరు వ్యక్తులతో అనధికారకంగా ప్రవేశించినందుకు గాను రూపాలి చకంకర్ పై మరో కేసు నమోదు అయ్యింది. దీనిపై పలు సెక్షన్ 188 తోపాటు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు పూణే నగర పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

Similar News