బంగ్లాదేశ్‌లో పడవ బోల్తా పడి 23 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2022-09-25 14:32 GMT

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరాటోవా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది మరణించారు. సుమారు 30 మందికి పైగా గల్లంతైనట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ జహిరుల్ ఇస్లాం నిర్ధారించారు. ప్రమాద సమయంలో పడవలో 80 మందికి పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

అయితే ప్రమాదానికి గల కారణాలు వెల్లడించలేదు. కాగా, బంగ్లాదేశ్‌లో తరుచుగా సురక్ష ప్రమాణాల్లో నిర్వహణ లోపం, ఓవర్ లోడింగ్ కారణంగా పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. గతేడాది పలు పడవ ప్రమాద సంఘటనల్లో పదుల సంఖ్యలో మరణించారు. చిన్న, మధ్య తరహా పడవలు సరైన ప్రమాణాలు, నిర్వహణ లోపం పాటించకుండా లోతు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

Similar News