రెజ్లర్ల ఇష్యూపై 1983 వరల్డ్ కప్ విజేతల రియాక్షన్ ఇదే

రెజ్లర్ల ఇష్యూపై 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజేతలు స్పందించారు.

Update: 2023-06-02 10:37 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను వేధించారంటూ భారత మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసనలపై 1983 వరల్డ్ కప్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా 1983 వరల్డ్ కప్ టీం ఆటగాడు మదన్ లాల్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లపై పోలీసుల తీరు సరిగా లేదని విమర్శించారు. వాళ్లను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు వ్యవహారం చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అదేవిధంగా తాము సాధించిన మెడల్స్ ను గంగా నదిలో పారేస్తామంటూ రెజ్లర్లు ప్రకటించారని, అది చాలా బాధాకరమని అన్నారు. ఎన్నో ఏళ్ల కష్టం, త్యాగం, పట్టుదలకు ఆ మెడల్స్ నిదర్శమని అన్నారు.

ఆ మెడల్స్ కేవలం ఆటగాళ్లకే కాదని జాతి యావత్తుకు చెందిన సంపద అని స్పష్టం చేశారు. మెడల్స్ ను నదిలో పడేయడంపై పునరాలోచించాలని భారత వెటరన్ క్రికెటర్లు రెజ్లర్లకు సూచించారు. త్వరలోనే రెజ్లర్ల సమస్యలకు పరిష్కారం లిభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని మదన్ లాల్ కోరారు. కాగా బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను వెంటనే పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News