ఆడబిడ్డల పెళ్ళిళ్లు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్

దిశ, రాజేంద్రనగర్: రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లను బాధ్యతగా తీసుకొని ఆర్థిక సాయం చేస్తోన్న ఏకైక సీఎం కేసీఆర్ అని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎంపీడీఓ ఆఫీసులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లి చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోన్న పేదల బాధలను గుర్తించి వారి పెళ్లిళ్ల బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Update: 2021-10-11 08:04 GMT

దిశ, రాజేంద్రనగర్: రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లను బాధ్యతగా తీసుకొని ఆర్థిక సాయం చేస్తోన్న ఏకైక సీఎం కేసీఆర్ అని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎంపీడీఓ ఆఫీసులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లి చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోన్న పేదల బాధలను గుర్తించి వారి పెళ్లిళ్ల బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు త్వరితగతిన లబ్ధిదారులకు చేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ జాంగీర్ ఖాన్, శ్రీకాంత్ యాదవ్, వెంకటేష్, లక్ష్మి, విజయలక్ష్మి, పుష్పలత, కవితాప్రసాద్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, నందు, మురళి యాదవ్, తాజ్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News