ఓటేయకపోతే పెన్షన్ బంద్ అని టీఆర్ఎస్ బెదిరిస్తోంది

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న డ్రగ్స్ దందా బట్టబయలు అవుతోందని త్వరలోనే వాళ్లు జైలుకెళ్లడం ఖాయం అని కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాయమాటలు, దొంగ దందాలు టీఆర్ఎస్ నేతలకు అలవాటే అని విమర్శించారు. రేపోమాపో జైలుకెళ్లేవారు మచ్చలేని జానారెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఓటు వేయకపోతే ఆసరా పెన్షన్ ఇవ్వరని టీఆర్ఎస్ బెదిరిస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండు […]

Update: 2021-04-11 08:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న డ్రగ్స్ దందా బట్టబయలు అవుతోందని త్వరలోనే వాళ్లు జైలుకెళ్లడం ఖాయం అని కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాయమాటలు, దొంగ దందాలు టీఆర్ఎస్ నేతలకు అలవాటే అని విమర్శించారు. రేపోమాపో జైలుకెళ్లేవారు మచ్చలేని జానారెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఓటు వేయకపోతే ఆసరా పెన్షన్ ఇవ్వరని టీఆర్ఎస్ బెదిరిస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు.

Tags:    

Similar News