ప్రజలకు ఉరికొయ్యగా మారిన LRS: కోమటిరెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ విధానం పేద ప్రజలకు ఉరికొయ్యగా మారిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో అవసరానికి ఉపయోగపడతాయనే భూములను కూడా ప్రజలు అమ్ముకోలేక నరకయాతన పడుతున్నారన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు ఖాయమైనప్పటికీ చేతిలో డబ్బులు లేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెట్టి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఎల్‌ఆర్ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Update: 2020-12-23 02:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ విధానం పేద ప్రజలకు ఉరికొయ్యగా మారిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో అవసరానికి ఉపయోగపడతాయనే భూములను కూడా ప్రజలు అమ్ముకోలేక నరకయాతన పడుతున్నారన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు ఖాయమైనప్పటికీ చేతిలో డబ్బులు లేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెట్టి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఎల్‌ఆర్ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News