అభివృద్ధే ఎజెండాగా పోటీ చేస్తున్నాం: జీవీఎల్

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఉప ఎన్నికలో అభివృద్ధే ఎజెండాగా బీజేపీ, జనసేన పోటీ చేస్తుందని బీజేపీ నేత జీవీఎల్ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి అనేది అరుదుగా కనిపించే మాటన్నారు. రాష్ట్రంలో కుల, ధన రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయని విమర్శించారు. వైసీపీ, టీడీపీ తిరుపతి ప్రాంత అభివృద్ధికి చేసిన ద్రోహం గురించి ప్రజలకు చెబుతామన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతితో కూడిన అభివృద్ధి జరిగిందని ఆరోపించారు. టీడీపీ […]

Update: 2020-11-25 12:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఉప ఎన్నికలో అభివృద్ధే ఎజెండాగా బీజేపీ, జనసేన పోటీ చేస్తుందని బీజేపీ నేత జీవీఎల్ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి అనేది అరుదుగా కనిపించే మాటన్నారు. రాష్ట్రంలో కుల, ధన రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయని విమర్శించారు. వైసీపీ, టీడీపీ తిరుపతి ప్రాంత అభివృద్ధికి చేసిన ద్రోహం గురించి ప్రజలకు చెబుతామన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతితో కూడిన అభివృద్ధి జరిగిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి కోసమే అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రాంత అభివృద్ధిపై బీజేపీ చర్చకు సిద్ధమని జీవీఎల్ సవాల్ విసిరారు.

Tags:    

Similar News