ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తగిలింది. జాంబాగ్ డివిజన్ అభ్యర్థి మద్దతుగా సోమవారం ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం తమకు అందలేదని అసదుద్దీన్‎ని మహిళలు నిలదీశారు. కష్టకాలంలో తమను పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్ ఓవైసీ వెనుదిరిగారు.

Update: 2020-11-23 00:40 GMT

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తగిలింది. జాంబాగ్ డివిజన్ అభ్యర్థి మద్దతుగా సోమవారం ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం తమకు అందలేదని అసదుద్దీన్‎ని మహిళలు నిలదీశారు. కష్టకాలంలో తమను పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్ ఓవైసీ వెనుదిరిగారు.

Tags:    

Similar News