‘ఖుషి’ అడ్వాన్స్ బుకింగ్స్కు ఎందుకింత ఆలస్యం?
విజయ్ దేవరకొండ, సమంత జంటగ నటించిన తాజా చిత్రం ‘ఖుషి’.
దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, సమంత జంటగ నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదలకానుంది. ఇక రిలీజ్కు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఇప్పటికీ మొదలుపెట్టలేదు. టికెట్ బుకింగ్స్ యాప్స్లో ఈ సినిమా బుకింగ్స్ కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. కాగా రిలీజ్కు రెండు రోజుల ముందు బుధవారం నుంచి ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచడానికి ఓ ప్లానింగ్ ప్రకారం నిర్మాణ సంస్థ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ను హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక టికెట్ ధర విషయానికోస్తే ధరలనుపెంచే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా ఈ టికెట్ రేట్స్పై మంగళవారంలోగా క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది.
Read More: మెగా కోడలితో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డ స్టార్ హీరో!