సినిమాల్లో పని చేసే ఆడవారితో అదే సమస్య.. వారిని తృప్తి పరచడానికి అది కావాలంటూ నటుడు కామెంట్స్!

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రచయిత తోటపల్లి మధు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమకు చెందిన పలవురు సెలబ్రిటీస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. శ్రీదేవి, సావిత్రి,

Update: 2024-05-04 08:11 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రచయిత తోటపల్లి మధు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమకు చెందిన పలవురు సెలబ్రిటీస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. శ్రీదేవి, సావిత్రి,ఎన్టీఆర్ ఇలా ఎంతో మంది ప్రముఖులు, సినయర్ నటీనటులపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఈయన మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఘరానా మొగుడు ఫేమ్ వాణి విశ్వనాథ్‌తో ఆయన ప్రేమాయణం నడిచిందని, వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందంటూ ఆయన తెలిపారు. అసలు విషయంలోకి వెళితే.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొనన తోటపల్లి మధు, భలే దంపతులు సినిమా సమయంలో వాణి విశ్వనాథ్ నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం.. దీంతో నేను పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. ఒక రోజు ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి కేరళలోని గురువాయుర్‌కు కూడా వెళ్లాం. కానీ మా బ్యాడ్ లక్, ఆ రోజు సూర్యగ్రహణం, అందువలన టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. దీంతో ఇద్దరం చాలా బాధపడ్డాము. ఇక లాభం లేదని వెనక్కి వచ్చేశాం. ఇక ఆ తర్వాత పెళ్లి టాపిక్ రాలేదు.. కానీ ఇద్దరం ప్రేమగా ఉంటూ ఏడాది పాటు కలిసి తిరిగాం. చాలా సంతషంగా గడిపాం. కానీ అప్పుడే చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. ఈ సినిమాలో పని చేసే ఆడవారితో దగ్గర సమస్య ఏమిటంటే వారిని వారిని తృప్తిపరిచేలాగా డబ్బులు సంపాదించాలి, మాటలు చెప్పాలి. అలా రెండు, మూడు సార్లు జరిగింది. పెళ్లి వరకు వెళ్లి.. అయిపోయింది అనుకున్నా కూడా అవ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More..

ప్రియుడితో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి..నిశ్చితార్థం వీడియో షేర్ చేసిన మోనిత.. 

Similar News