డాక్టర్ తప్పుడు ట్రీట్మెంట్ వల్ల ప్రముఖ కమెడియన్‌కు క్యాన్సర్.. 25 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం..!

‘ది కపుల్ శర్మ’ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అతుల్ పర్చురే.

Update: 2023-07-18 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ది కపుల్ శర్మ’ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అతుల్ పర్చురే. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ‘‘నాకు పెళ్లై 25 సంవత్సరాలయ్యింది. మేము ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత తినేటప్పుడు నాకు కాస్త ఇబ్బంది అనిపించేది. దీంతో హాస్పిటల్‌కు వెళ్లగా.. నాకు అల్ట్రాసోనోగ్రఫీ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. నా లివర్‌లో ఐదు సెంటిమీటర్ల కణితి ఉందని, అది క్యాన్సర్ అని తేల్చారు. ఆ సమయంలో డాక్టర్స్ తప్పుడు ట్రీట్‌మెంట్ ఇవ్వడం వల్ల నా ప్యాంక్రియాస్ ప్రభావితమయ్యింది. అలాగే సరైన చికిత్స అందకపోవడంతో నా పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. అప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయాను. మాట్లాడేటప్పుడు నాలుక తడబడేది. అనంతరం వేరే వైద్యుడిని సంప్రదించానని’’ అతుల్ చెప్పుకొచ్చాడు.

Read More:   ‘బేబీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. యూత్‌కు పండగే

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News