25 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో మ‌ళ్లీ ఆ క్రేజీ కాంబినేష‌న్!

బాలీవుడ్ దర్శకనిర్మాత క‌రణ్ జోహార్ గురించి పరిచయం అక్కర్లేదు.

Update: 2023-08-09 10:12 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ దర్శకనిర్మాత క‌రణ్ జోహార్ గురించి పరిచయం అక్కర్లేదు. మంచి ఫ్యామిలీ మూవీస్ తెరకెక్కించడంలో అతని తర్వాతే మరెవరైనా. అలా కరణ్, సల్మాన్ ఖాన్ కాంబోలో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతా హై’ మూవీ భారీ విజయం అందుకుంది. ఇక ఈ మూవీ వచ్చి 25 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఈ హిట్ కాంబినేష‌న్ మాత్రం మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌లేదు. స‌ల్మాన్ కూడా ఎంతోమంది ద‌ర్శకులను రిపీట్ చేసాడు. కానీ క‌ర‌ణ్‌తో మాత్రం సినిమా చేయ‌లేదు.

దీంతో తాజాగా ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. ఈ మూవీకి క‌ర‌ణ్ కేవ‌లం నిర్మాత మాత్రమే.. విష్ణు వ‌ర్దన్ ద‌ర్శకుడిగా వ్యవహారిస్తున్నాడు. నవంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగా ప్రారంభంకానుంది. ఈ నెల‌లో ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొత్తం పూర్తికానున్నాయి. ఈ ఏడాది ప్రారంభించి వ‌చ్చే ఏడాది క్రిస్మస్ కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారట‌. యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో మునుపెన్నడూ చూడ‌ని ఒక కొత్త సల్మాన్ భాయ్‌ని చూపించబోతున్నారట.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News