ఆ విషయంలో జ్యోతిక ప్రవర్తన బాగోలేదు.. అత్తింటి పరువు తీసింది.. నటుడు వివాదాస్పద కామెంట్స్

కోలీవుడ్ స్టార్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక ఒకరు.

Update: 2024-04-28 07:02 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ జంట.. చాలా కాలం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఫ్యామిలీ లైఫ్‌కు ప్రాధాన్యం ఇచ్చిన జ్యోతిక సినిమాలకు దూరంగా ఉంటూ.. పిల్లల్ని దగ్గరుండి చూసుకుంది. ఇక వారు పెద్దవాళ్లు అయ్యి.. చదువుల్లో బిజీగా ఉండటంతో రీసెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఇటీవల తన భర్త సూర్య నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 36 వయదినిలే చిత్రంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా హిట్‌తో ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇదిలా ఉంటే.. జ్యోతిక ప్రవర్తన బాగోలేదు.. అత్తింటి పరువు తీసింది అంటూ తమిళ నటుడు బైల్వాన్ రంగనాథన్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అసలు ఏం జరిగిందంటే..

రీసెంట్‌గా తమిళనాడులో లోకసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్ల కోసం తమిళ స్టార్ హీరో సూర్య ముంబాయి నుంచి వచ్చి మరి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే.. జ్యోతిక మాత్రం రాలేదు. ప్రస్తుతం ఇదే మేటర్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పాటు ఆమె నేపాల్ పర్యటనకు వెళ్లినట్లు వీడియోలు సైతం విడుదల చేసింది. దీనిపై స్పందిస్తూ కొంతమంది నెటిజన్లు.. ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యత. అది మరిచి ఇలా చెయ్యడం కరెక్ట్ కాదంటూ జ్యోతికను ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నటుడు, జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ‘ఓటు వెయ్యడనికి జ్యోతిక రాలేదని అందరూ ఆమె మామ, సూర్య తండ్రి శివకుమార్‌ను ప్రశ్నిస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది. కొడుకు మాత్రమే వచ్చి కోడలు ఓటు వెయ్యడానికి రాలేదంటే.. నలుగురికి ఆయన ఏమని సమాధానం చెప్తారు. ఈ విషయంలో జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు. అత్తగారింటి పరువు తీసింది అన్నట్లుగా చేసిన బైల్వాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వివాదాస్పదంగా మారాయి. దీంతో బైల్వాన్‌ను ట్రోల్స్ చేస్తున్నారు సూర్య, జ్యోతికల ఫ్యాన్స్.

Similar News