రూ. 2 కోట్ల యాడ్‌ను ఈజీగా తిరస్కరించిన స్టార్ హీరోయిన్.. అందుకు ఆమె చెప్పిన కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం భాషతో సంబందం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

Update: 2024-05-06 09:42 GMT

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం భాషతో సంబందం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ‘ఫిదా’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అనతికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎటువంటి స్కిన్ షో చెయ్యకుండా మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ అంటే కుర్రాళ్లు పడి చచ్చిపోతారు. అంతే కాకుండా ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే సాయిపల్లవి చాలా విషయాల్లో భిన్నంగా ఉంటోంది. తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. నచ్చకుంటే ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చిన రిజెక్ట్ చేస్తుంది. సినిమాలే కాదు తనకు ఇష్టం లేదని రూ. 2 కోట్లు ఇస్తానన్న యాడ్‌ను కూడా తిరస్కరించిదట ఈ బ్యూటీ.

2019 వ సంవత్సరంలో ఒక బ్లీచింగ్ క్రీమ్ కంపెనీ.. ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ కోసం సాయిపల్లవిని సంప్రదించిందట. అందుకు రెమ్యునరేషన్ రూ. 2 కోట్లు ఇస్తానని చెప్పారట. కానీ ఆమె ఆఫర్‌ను చాలా ఈజీగా రిజెక్ట్ చేసింది. అసలు ఎందుకు ఈ ఆఫర్ తిరస్కరించాల్సి వచ్చిందో తెలిపింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో ఉన్నప్పుడు.. నల్లగా ఉండే అబ్బాయిలతో తెల్లగా ఉన్న అమ్మాయిలను చూసి నా ఫ్రెండ్స్ షాక్ అయ్యేవారు. నువ్వు అతని కంటే చాలా అందంగా, తెల్లగా ఉన్నావు అని చెప్పేవారు. అలాగే.. నల్లగా ఉన్న అమ్మాయితో తెల్లగా ఉండే అబ్బాయిని చూస్తే.. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఏం మాయ చేసుంటుందో అంటూ కామెంట్స్ చేసేవారు. అందేకే స్కిన్ కలర్‌కి ప్రాధాన్యత ఉండకూడదనే ఉద్దేశంతోనే కోట్ల ఆఫర్ ఇచ్చిన ఆ యాడ్ చెయ్యనని రిజెక్ట్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ సాయిపల్లవి.

Read More...

ఈ స్టార్ హీరోతో అలా చేయడానికి 5 కోట్ల క్రేజీ ఆఫర్.. కాదని చెప్పి షాక్ ఇచ్చిన హీరోయిన్..! 

Similar News