టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. ఒక్క చాట్తో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
ఒకప్పటి స్టార్ హీరోయిన్, సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్, సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో, క్యూట్నెస్తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని.. అప్పటల్లో వరుస సినిమాలతో దూసుకుపోయేది. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘రాజకుమారుడు’ మూవీతో కుర్రాళ్లకు క్రష్గా మారిపోయింది ఈ బ్యూటీ. ఇక కెరీర్ మంచి ఫాములో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరం అయిన ప్రీతి.. ప్రస్తుతం పంజాబ్ టీమ్ ఫ్రాంచైజీ ఓనర్గా రాణిస్తుంది.
అయితే సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. 50 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గని తన అందాలతో రచ్చ చేస్తుంటోంది. దాంతో పాటు.. అప్పుడప్పుడు ఫ్యాన్స్తో ముచ్చటిస్తూ ఉటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన ప్రీతి తన రీఎంట్రీపై స్పందించింది. ‘నేను అసలు సినిమాలు చేయను అని ఎప్పుడూ చెప్పలేదు. మంచి కథ వస్తే నేను నో చెప్పకుండా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆరేళ్ల తర్వాత బాలీవుడ్లో ఇప్పుడే రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రీతి జింటా.. మంచి కథ దొరికితో టాలీవడ్లో కూడా ఎంట్రీ ఇస్తదేమో వేచి చూడాల్సి ఉంది.