యాంకర్ శ్యామల చీకటి బాగోతాలన్నీ బయటపెడతానంటూ మహిళా నేత సెన్సేషనల్ కామెంట్స్

కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతుండటంతో పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

Update: 2024-05-06 11:35 GMT

దిశ, సినిమా: కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతుండటంతో పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది వారికి నచ్చిన పార్టీ తరపున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే బుల్లితెర యాంకర్ శ్యామల కూడా వైసీపీకి సపోర్ట్‌గా ఉంటూ ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసి సెన్సేషన్‌గా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో శ్యామల ప్రచారం చేస్తూ ఆ రెండు పార్టీలోని నేతలపై కూడా పలు కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో శ్యామల చేసిన కామెంట్లపై టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూష స్పందిస్తూ.. ‘‘ఒకప్పుడు శ్యామల షర్మిల తెలంగాణలో పెట్టిన పార్టీలో చేరింది. దాన్ని తీసేయడంతో.. కుల పిచ్చితో ఏపీకి వచ్చి జగన్ వైసీపీ పార్టీలో చేరింది. అసలు ఆమెకు ఆంధ్రలో ఏం పని. అక్కడ ఉన్నది మేము. చాలా నష్ట పోయాము. జగన్ తల్లిని, చెల్లిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు.

కాబట్టి ప్రజలు కూడా అతన్ని తరిమికొట్టడానికి రెడీగా ఉన్నారు. శ్యామల సినిమా ఫంక్షన్స్, సీరియల్స్, చేసుకోక రాజకీయాలు ఎందుకు? ఏం తెలియకుండానే పవన్ కల్యాణ్, చంద్రబాబుల గురించి మాట్లాడితే ఊరుకోం. శ్యామల భర్త చేసిన ఫోరాలు, ఆమె చీకటి బాగోతాలు బయటపెడతాను. ఆమె లాగా కథలు చెప్పను అన్ని నిజాలే చెప్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనూష కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో ఈ విషయం తెలిసిన వారంతా శ్యామల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Similar News