సిద్ధార్థ తో సీక్రెట్ నిశ్చితార్థం.. క్లారిటీ ఇచ్చిన అదితి రావ్.

'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ మూవీలో కలిసి నటించిన కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి రిలేషన్ లో వున్న విషయం మన అందరికీ తెలిసిందే.

Update: 2024-05-04 04:36 GMT

దిశ,సినిమా: 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ మూవీలో కలిసి నటించిన కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి రిలేషన్ లో వున్న విషయం మన అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఇరు కుటుంబాల అంగీకారంతో మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్‌ రంగనాథ స్వామి దేవాలయంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. దీనిపై అదితి స్పందించి నిశ్చితార్థం విషయం బయట పెట్టడానికి గల కారణం చెప్పారు.

వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం ఆలయంలోని సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో పురోహితులు దగ్గరుండి ఈ నిశ్చితార్థం వేడుక జరిపించారు. అయితే నిశ్చితార్థంపై ఇప్పటివరకు అదితి రావు ఎటువంటి ప్రకటన చేయకపోవడం విశేషం.

ఇదిలావుంటే తాజాగా ఈ నిశ్చితార్థంపై అదితి రావ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తన తల్లి కోరిక మేరకు నాకు నిశ్చితార్థం అయినట్లు బహిరంగంగా ప్రకటించినట్లు అదితి వెల్లడించారు. నా ఎంగేజ్‌మెంట్ అయిన రోజు చాలా మంది మా అమ్మకు కాల్ చేసి నిజంగానే అదితి పెళ్లి చేసుకోబోతోందా అని మా పెళ్లి గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. ఇక అమ్మ కూడా వారి బాధ చూడలేక.. దయచేసి ప్రజలకు చెప్పండి, నాకు నాన్‌స్టాప్ కాల్స్ వస్తున్నాయి అంటూ తెలిపింది. దీంతో నేను నేను, సిద్ధార్థ్‌ దీనిపై పోస్ట్‌లు పెట్టాం. నా నిశ్చితార్థం 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఈ గుడితో మా ఫ్యామిలీకి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె నటించిన ‘హీరామండి’ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


Similar News