అమెరికా నుంచి Samantha సడెన్‌గా హైదరాబాద్ కు వచ్చేసింది.. ఎందుకో తెలుసా..?

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.

Update: 2023-09-08 04:32 GMT

దిశ,వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. హిట్ టాక్ అయితే సంపాదించింది కానీ కలెక్షన్స్ మాత్రం ఒక మోస్తారు గానే ఉన్నాయి. అమెరికాకు వెళ్లిన సామ్ ఇండియాకు వస్తున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే..

 ఖుషి ప్రమోషన్ ఈవెంట్లో అమెరికాలో జరగగా, ఆ ఈవెంట్లో   సామ్ పాల్గొన్న విషయం మనకి తెలిసిందే.. అమెరికాకు వెళ్లి అక్కడే కొన్ని రోజు ఉండాలనుకున్న సమంత సడన్ గా ఎందుకు హైదరాబాద్ వచ్చేస్తుంది అన్న వార్త బాగా వైరల్ అవుతుంది.  ఖుషి మేకర్స్ ప్రస్తుతం సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే సమంతను మేకర్స్ హైదరాబాద్ పిలిచినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలిసి ఉంది. 

Read More:   Kangana Ranautను చెంపదెబ్బలు కొట్టాలని ఉంది: షాకింగ్ కామెంట్స్ చేసిన నటి

Tags:    

Similar News