దసరా ఈవెంట్‌లో రోజాకు షాక్.. అవమానించడానికే పిలిచారా అంటూ ఎమోషనల్

పండుగలు వస్తున్నాయంటే చాలు.. తెలుగు చానల్స్ బుల్లితెరపై అనేక వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాయి.

Update: 2022-09-26 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: పండుగలు వస్తున్నాయంటే చాలు.. తెలుగు చానల్స్ బుల్లితెరపై అనేక వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాయి. ఆ ఈవెంట్స్‌కు సెలబ్రిటీలను తీసుకొచ్చి మరింత ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ టీవీ చానల్‌లో దసరా సందర్భంగా ఓ కొత్త ప్రోగ్రామ్ చేసి, దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వహకులు. ఆ వీడియోలో నటీ, ఏపీ మంత్రి రోజా గెస్ట్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రోజాను చూసి అందరూ ఉత్సహంతో ఊగిపోయారు.

హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్‌ పంచులు.. రకరకాలు స్క్రిఫ్ట్‌లు, పర్ఫామెన్స్‌తో అలరించారు. గెటప్ శ్రీను దశవతారాల్లో కనిపించి షోను మరింత హైలెట్ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, ఇక ప్రోమో ఎండ్ అవుతుందనగా రోజా సీరియస్ అయినట్లు చూపించారు. ''నన్ను అవమానించడానికే షోకి రమ్మన్నారా?? అందరూ ప్లాన్ చేసుకుని మరి పిలిచారు కాదా.. అంటూ రోజా ఎంతో ఎమోషనల్‌గా స్టేజ్ దిగి వెళ్లిపోయింది. ఇక అంతటితో ప్రోమో ఎండ్ అయింది. అయితే రోజా ఎందుకు సీరియస్ అయిందో తెలియాలంటే దసరా ఈవెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Similar News