ఉదయ్ పూర్ లో Raghav Chadha, Parineeti Chopra వివాహం

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఈ నెలాఖరున రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకోబోతున్నారు.

Update: 2023-09-06 03:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఈ నెలాఖరున రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. సెప్టెంబర్ 23 మరియు 24 తేదీల్లో లీలా ప్యాలెస్, ది ఒబెరాయ్ ఉదయ విలాస్‌లో వివాహ వేడుకలు జరగనున్నాయి. 200 మందికి పైగా అతిథులు బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా 50 మందికి పైగా వీవీఐపీలు వివాహానికి హాజరు కాబోతున్నారని సమాచారం. బుకింగ్‌లు ఖరారైన వెంటనే రెండు హోటళ్లలో వివాహ వేడుకలకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ వివాహానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు హాజరుకానున్నారు. పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నారు.

హోటళ్లకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, హల్దీ, మెహందీ, మహిళల సంగీత్‌తో సహా వివాహ కార్యక్రమాలు సెప్టెంబర్ 23న ప్రారంభమవుతాయి. పెళ్లి తర్వాత, హర్యానాలోని గురుగ్రామ్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. వీవీఐపీ అతిథుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ అధికారులు ఆ హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. రెండు నెలల క్రితం రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా హోటళ్లను పరిశీలించేందుకు గాను ఉదయపూర్‌కు వెళ్లారు. మే 13న ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మాజీ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, కపిల్ సిబల్, శివసేన నాయకుడు ఆదిత్య థాకరే లాంటి ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి:   ప్రభాస్‌తో మరో సినిమా చేయడంపై స్పందించిన అనుష్క! 

Tags:    

Similar News