సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ అటు రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Update: 2023-06-06 06:25 GMT

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ అటు రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బ్రో, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో విడుదలవుతాయా అని ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ తేదీ జూన్ 14న నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అన్నవరం నుండి భీమవరం వరకు తొలి విడత యాత్ర ఉంటుందని వెల్లడించారు.

మొదటగా అన్నవరంలో వారాహి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సమాచారం. తాజాగా, పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారాహి యాత్ర, ఏపీ ఎన్నికలు సమీపిస్తోన్న కారణంగా సినిమా షూటింగ్‌లకు తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, పవన్ సినిమాల కోసం ఎదురు చూస్తోన్న అభిమానులు ఈ విషయం తెలిసి నిరాశ చెందుతున్నారు.

Read more: Allu Arjun : స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకోవడం అల్లు అర్జున్ తల్లికి ఇష్టం లేకపోవడానికి కారణం అదేనట? 

Rashmi Gautam: తప్పు చేసి ఉంటే క్షమించండంటూ.. పోస్ట్ చేసిన రష్మీ

‘గుంటూరు కారం’ స్టోరీ నెరేటర్‌గా తమిళ నటుడు.. 

Tags:    

Similar News