అలా చేయడంతో అక్కినేని హీరోను ఆడేసుకుంటున్న నెటిజన్లు.. పోస్ట్ వైరల్

అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సుశాంత్ ‘కాళిదాసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.

Update: 2024-05-07 10:15 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సుశాంత్ ‘కాళిదాసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత పలు అడ్డా, కరెంట్, అలా వైకుంఠపురం లో, చిలసౌ, భోళా శంకర్ వంటి సినిమాలతో మెప్పించాడు. ఇటీవల సుశాంత్ రవితేజ రావనాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సుశాంత్ ఆ తర్వాత ఏ కొత్త సినిమా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తున్నాడు.

తాజాగా, సుశాంత్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ దుమారం రేపింది. ఓ ఫొటో షేర్ చేసి క్యాప్షన్ పెట్టలేదు పర్లేదు కదా? అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన ఓ నెటిజన్ ఫొటో పెట్టకపోయినా పర్లేదు అని కౌంటర్ వేశాడు. ఇక సుశాంత్ కోపంతో అతడిని బ్లాక్‌లో పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా సుశాంత్‌ను ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. దీంతో అక్కినేని కూల్ అయిపోయి.. ఏంటి బ్రో అంత మాట అనేశావ్ అని పోస్ట్ పెట్టాడు. అయినప్పటికీ నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

Similar News