ఎన్నికల వేళ బూతు పాట వదిలిన మెగా డాటర్ నిహారిక.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టింది.

Update: 2024-05-07 14:32 GMT

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టింది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తమిళ్‌లో హీరోయిన్‌గా ఓ మూవీ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఒక్కోసారి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా.. అసలు వాటిని పట్టించుకోకుండా హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్ మతిపోగొడుతుంది. అంతేకాకుండా నిర్మాతగా మారి పలు చిత్రాలు తెరకెక్కిస్తోంది. అయితే నిహారిక ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై కమిటీ కుర్రోళ్ళు రాబోతుందంటూ ఇప్పటికే ప్రకటన కూడా విడుదలైంది. తాజాగా, నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది.

ఎన్నికలు రాబోతుండటంతో.. ఓట్ల కోసం డబ్బులకు అమ్మడు పోయే వాళ్లను విమర్శిస్తూ సాంగ్ లిరిక్స్ క్రియేట్ చేశారు. ఐదేళ్లకోసం మోసపోయే గొర్రెలను మింగ, డబ్బిచ్చేటోళ్లను మింగ, ఓట్లు అమ్మేటోళ్లను మింగ అని సాగుతోంది. దీంతో ఈ మింగ అనే పదానికి ఓ పచ్చి బూతు పదంగా మార్చి సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. బూతులు దారుణంగా ఉండటంతో అది చూసిన వారంతా నిహారికను ట్రోల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ లో ఉండి ఇలాంటి బూతు సాంగ్ పెట్టడం ఏంటని ఏకి పారేస్తున్నారు.

కానీ నిహారికి పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేస్తూ.. ఈ పాటను వదిలిందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. కాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన గెలవాలని మెగా హీరోలు సైతం ప్రచారాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి కూడా చేశారు.

Read More...

ఇన్ స్టాలో ఆ వీడియో పెట్టిన స్వాతి.. ఛీ నీ బతుకు అంటూ కామెంట్స్! 



 

Full View

Similar News