నటి భాగ్యశ్రీ సోదరి మర్డర్..?

మరాఠి టెలివిజన్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ సోదరి మధు మార్కాండేయ ఆదివారం మరణించింది.

Update: 2023-03-14 12:27 GMT

దిశ, సినిమా : మరాఠి టెలివిజన్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ సోదరి మధు మార్కాండేయ ఆదివారం మరణించింది. ఆమె బాడీ పుణెలో లభ్యం కాగా.. ముఖంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తుండగా.. నటి భాగ్యశ్రీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాగా మధు వృత్తిపరంగా బేకర్‌ కాగా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం రూమ్ వెతికేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కళ్లుతిరిగి పడిపోగా.. స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. కానీ మధు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. అయితే ఆమెది హత్య అయి ఉంటుందని అనుమానిస్తున్నారు కుటుంబసభ్యులు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News