Mahesh Babu : ఇక విరామం తీసుకునే ప్రసక్తే లేదంటున్న..

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’.

Update: 2023-08-20 08:43 GMT

దిశ, సినిమా: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీకి ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. దీంతో అసలు ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి మహేష్ బాబు పూర్తి చేస్తాడా లేదా అని సోషల్ మీడియాలో చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక ఈ చిత్రం ఇంకా ప్రారంభ నిర్మాణ దశలోనే ఉండగా.. మొత్తం షూటింగ్ పూర్తి కావడానికి దాదాపు 90-100 రోజులు పట్టవచ్చని అంచనా. కాగా ఈ మూవీని అనుకున్నట్టుగా 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే.. మహేష్ డిసెంబర్ వరకు ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా నిరంతరం పని చేయాల్సి ఉంటుంది. దీంతో మహేష్ కూడా సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి : Prabhas ‘Salaar’ విషయంలో మరింత కేర్ పెంచేసిన దర్శకుడు..!

Tags:    

Similar News