రూ.500 కోట్లతో ‘మహాభారతం’.. బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం ‘కంగువ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు

Update: 2024-01-20 05:30 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం ‘కంగువ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో ‘మహాభారతం’ ఆధారంగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రంతో సూర్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. డిఫరెంట్ రోల్ లో ఆయన కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ అయితేనే పర్ఫెక్ట్ అని దర్శకుడు భావిస్తున్నాడట. ఇక రూ.500 కోట్ల రూపాయలకు పై బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా తెలియాల్సి ఉంది.

Full View



Tags:    

Similar News