భార్య మంగళ సూత్రం అమ్మి పేకాట.. తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో పవర్ స్టార్ సినిమాలపై కొంత ఫోకస్ తగ్గించినట్లే చెప్పాలి. ఇక ఈయనకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట

Update: 2024-05-04 03:53 GMT

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో పవర్ స్టార్ సినిమాలపై కొంత ఫోకస్ తగ్గించినట్లే చెప్పాలి. ఇక ఈయనకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా పవర్ స్టార్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పవన్ కళ్యాణ్ ఎక్కువగా తివిక్రమ్, నిర్మాత శరత్ మరార్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాడు. వీరితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శరత్ మరార్.. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ నిర్మాతలను ఇబ్బంది పెడతారని చాలా మంది అంటారు కానీ ఆయన అలాంటి వ్యక్తికాదు. సహాయం చేస్తాడు తప్ప సమస్యల్లోకి నెట్టడు. మరీ ముఖ్యంగా డబ్బు విషయంలో ఎలాంటి ప్లానింగ్స్ పెట్టుకోడు. ఎవరికైనా సమస్య వస్తే చాలా డబ్బులు ఇచ్చేస్తాడు. పిల్లలు ఉన్నారు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండు అని నేను, తివిక్రమ్ చాలా సార్లు చెప్పాం, వారికి వారి లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన స్ట్రెంత్ ఇస్తాను అని చెప్పారని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా తాను పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన‌ను గుర్తు చేసుకున్నాడు. శరత్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ దగ్గర పని చేసే ఓ వ్యక్తి తన భార్య మంగళ సూత్రాన్ని అమ్మి వేసి, పేకాట ఆడాడు. దీంతో ఆమె పవన్ వద్దకు వచ్చి బోరున ఏడ్చింది. ఆమె కన్నీరు చూసి బాధపడిన పవన్ కళ్యాణ్.. తనకు ఆర్థిక సహాయం చేసి, ధైర్యం చెప్పారు. అంతే కాకుండా ఆమె భర్తను పిలిపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చాలా కోపంతో ఆయన్ను బెదిరించాడు. దీంతో ఆయన మళ్లీ పేకాట జోలికి పోకుండా పద్ధతిగా పని చేసుకోవడం మొదలు పెట్టాడు. పవర్ స్టార్ అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More..

నేను ప్రపోజ్ చేశా.. తనే ఒప్పుకోలేదు.. మొత్తానికి ఆమెను ప్రేమించానని ఒప్పుకున్న ప్రభాస్

Similar News