ఇంపార్ఫెక్ట్‌లీ పర్ఫెక్ట్ పార్టనర్‌షిప్.. జాన్వీ ప్రియుడితో ఉన్న ఫొటోపై కామెంట్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది.

Update: 2024-05-09 06:12 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’ తో పాటు.. రామ్ చరణ్‌తో కూడా ఓ సినిమా చేస్తుంది ఈ అమ్మడు. అంతే కాకుండా బాలీవుడ్‌లో కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సరసన హీరోయిన్‌గా నటిస్తుంది జాన్వీ.

మోస్ట్ అవైటెడ్ క్రికెట్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మూవీకి శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా విడుదల చేసింది జాన్వీ. ఈ మేరకు ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ మే- 31- 2024 న రిలీజ్ కానుంది’ అంటూ పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా ఈ పోస్టర్‌పై ‘ఇంపార్ఫెక్ట్‌లీ పర్ఫెక్ట్ పార్టనర్‌షిప్’ అనే క్యాప్షన్ ఉండటం విశేషం.

Similar News