నేను మోసపోయా.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..రూ.3 వేలు కట్టిమరీ!

జబర్దస్త్‌ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమైన హైపర్ ఆది గురించి సుపరిచితమే. ఆది బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే మంచి ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నాడు. తను షోస్ చేస్తూనే సినిమాల్లో నటించి మెప్పించాడు.

Update: 2024-04-27 12:02 GMT

దిశ,వెబ్‌డెస్క్: జబర్దస్త్‌ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమైన హైపర్ ఆది గురించి సుపరిచితమే. ఆది బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే మంచి ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నాడు. తను షోస్ చేస్తూనే సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీకి మద్దతుగా స్టార్‌ క్యాంపెయినర్‌ గా హైపర్ ఆది ఏపీలో ప్రచారం చేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ,పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో కమెడియన్‌గా స్టార్‌ డమ్‌ దక్కించుకున్న హైపర్ ఆది కెరీర్‌ స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట.

రీసెంట్‌గా ఆది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాను ఇండస్ట్రీకి రావడానికి తాను చాలా కష్టపడ్డాడంట.హైపర్ ఆది మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకన్నాను అని చెప్పారు. దీంతో అవకాశాల కోసం తిరిగుతున్నాడంట. అప్పుడే ఆదికి ఒక ప్రొడక్షన్‌ హౌస్‌కి వెళ్తే అక్కడ రూ.3000 కట్టమన్నారంట. ఏమి ఆలోచించకుండా అడిగినంత డబ్బు అక్కడ ఇచ్చి అతని ఫోన్‌ నెంబర్ ఇచ్చి వెళ్లాడంట.

ఇండస్ట్రీకి వెళ్లాలని ఎదురుచూస్తున్న ఆది తర్వాత రోజు ఎంతో ఉత్సాహంతో ఆ ప్రొడక్షన్ ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ ఎవరు కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన ఆది. చుట్టుపక్కల వారిని అడిగాడు ఎటువంటి ప్రొడక్షన్ సంబంధించిన వారు ఎవరు లేరు అని చెప్పారు. ఆది నుంచి డబ్బులు తీసుకున్న వారికి ఆ ప్రొడక్షన్‌ హౌస్‌కి సంబంధం లేదని తర్వాత తెలిసిందంట. ఈ క్రమంలోనే తాను మోసపోయాను అని తెలుసుకున్నాడు. అవకాశాల కోసం ప్రయత్నించే వారు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని ఆది సూచించాడు.

Similar News