హైపర్ ఆది నన్ను అలా చేశాడు.. పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ రోహిణి సంచలన కామెంట్స్?
బుల్లితెర నెంబర్ వన్ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు.
దిశ, సినిమా: బుల్లితెర నెంబర్ వన్ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ముఖ్యంగా లేడీ కమెడియన్ రోహిణి కూడా జబర్దస్త్ షోలో మైపర్ ఆది టీమ్లో చేరి పలు స్కిట్స్ చేసింది. అలాగే శ్రీదేమి డ్రామా కంపెనీలో కూడా పాల్గొంటూ తన కామెడీతో ఎంతో మందిని నవ్విస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. రోహిణి కామెడీ టైమింగ్ బాగుండడంతో అందరూ ఆమె చేసే స్కిట్స్ కోసం ఎదురుచూస్తారనడంతో అతిశయోక్తి లేదు.
అయితే ఈ అమ్మడు పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇటీవల ఆమె సేవ్ ది టైగర్స్ వెబ్సిరీస్లో పని మనిషిగా చేసి అలరించింది. తాజాగా, రోహిణి హైపర్ ఆదిపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. హైదర్ ఆది నా వ్యాపారం నాశనం చేసి నా కడుపు కొట్టాడు. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు కాబట్టి అతనే నన్ను పెళ్లి చేసుకోవాలని ఆరోపించింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న రోహిణి ఓ స్కిట్ చేసింది.
ఇందులో ఐస్క్రీమ్, బుగ్గలు అమ్ముకునే ఆమెలా కనిపించింది. అయితే ఇదే షోకి వచ్చిన హైపర్ ఆది తన పంచులతో ఆమె వ్యాపారాన్ని పాడు చేస్తాడు. దీంతో కోపంతో రగిలిపోయిన రోహిణి సంచలన ఆరోపణలు చేసింది. తన కడుపు కొట్టాడు కాబట్టి అతనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. కానీ ఇదంతా నిజజీవితంలో కాదు.. స్కిట్లో భాగం అని తెలుస్తోంది. ప్రస్తుతం రోహిణి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతు