పిల్లలను కనకపోయినా సరే కానీ బాగా ఎంజాయ్ చేయి అని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య షాకింగ్ కామెంట్స్!

యాంకర్ వింధ్య బుల్లితెరపై పలు షోస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్పోర్ట్స్ యాంకర్‌గా మారి తనదైన స్టైల్లో మాట్లాడుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

Update: 2024-05-07 11:21 GMT

దిశ, సినిమా: యాంకర్ వింధ్య బుల్లితెరపై పలు షోస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్పోర్ట్స్ యాంకర్‌గా మారి తనదైన స్టైల్లో మాట్లాడుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఐపీఎల్ మ్యాచ్‌లకు కామెంటరీ ఇస్తూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వింధ్య షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘మా అమ్మ నాకు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటుంది. నువ్వు సొసైటీ గురించి ఆలోచించకు. ఈ ఏజ్‌లోనే పెళ్లి చేసుకోవాలి.. పిల్లలను కనాలి. అలాంటి బట్టలే వేసుకోవాలనేది బ్రెయిన్ నుంచి తీసేయ్.

మేము జీవితంలో ఎంజాయ్ చేయలేకపోయాము. కాబట్టి నువ్వు బాగా ఎంజాయ్ చేయాలి. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలను కనకపోయినా పర్లేదు. కానీ నీకు నచ్చిన పని చేయి. నచ్చినట్టు ఉండు. అంతేకానీ ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించి నీ ఇష్టాలను వదులుకోకు. నీ క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారో అని నిన్ను నువ్వు కోల్పోకు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్. అని చెప్తుంది కానీ అదే చేయి లాంటివి ఎప్పుడూ చెప్పలేదు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Similar News