చిన్నప్పుడే అనుష్కతో కలిసి సినిమా చేసినట్లు డ్రీమ్ వచ్చింది: నవీన్ పొలిశెట్టి

‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.

Update: 2023-08-28 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమా సెప్టెంబరు 7వ తారీకున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అనుష్క హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ చిత్ర బృందం విశాఖ హోటల్ గ్రీన్ పార్క్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. హీరో నవీన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌కు, ప్రొమోలకు మంచి స్పందన లభించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీలో అనుష్క నుంచి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నాకు హీరో ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉండేది. అలాగే నాకు చిన్నప్పుడే అనుష్కతో కలిసి మూవీ చేస్తానని కల వచ్చింది. ఆ డ్రీమ్ ఇప్పుడు నిజమైంది.’’ అంటూ నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చారు.

Read More:    ఆ టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పేశా.. ఫస్ట్ లవ్‌పై జాన్వీ ఓపెన్

Tags:    

Similar News