నిఖిల్ ‘స్వయంభు’ నుంచి బిగ్ అప్‌డేట్.. వామ్మో ఒక్క యాక్షన్ సీన్‌కు అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారా?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, కలర్ స్వాతి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘కార్తికేయ’.

Update: 2024-05-07 11:37 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, కలర్ స్వాతి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘కార్తికేయ’. ఈ మూవీతో మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్.. తర్వాత దీనికి సీక్వెల్‌గా ‘కార్తీకేయ 2’ చేశాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో సిద్ధార్థ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రజెంట్ ఈయన నటిస్తున్న సినిమా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీది ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు.. ‘‘స్వయంభు’ టీం ఒక పురాతన యుద్ధ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది. 12 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌ను రూ. 8కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. నిఖిల్ యాక్షన్, స్టంట్స్‌లో సాగే ఈ భారీ వార్ సీక్వెన్స్ పెద్ద స్క్రీన్‌లపై అద్భుతంగా కనిపిస్తోంది’ అంటూ పోస్ట్ పెట్టారు. కాగా.. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Similar News