అనిల్ రావిపూడి వివాదాన్ని కెలికిన హైపర్ ఆది.. చిరాకుతో గట్టిగా ఇచ్చి పడేసిన డైరెక్టర్

టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా రాణిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-05-25 10:08 GMT

దిశ, సినిమా: టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా రాణిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కథలకు ఎంటర్టైన్మెంట్ జోడించి హిట్స్ కొట్టడం అతని స్టైల్. ఇటీవల అనిల్ రావిపూడి సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు.

సాయంత్రం వచ్చి థియేటర్స్ లో సినిమా చూడండి. ఫోన్ లో స్కోర్ చూసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీంతో అనిల్ రావిపూడి పై నెటిజన్లు రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు. ఐపీఎల్ చూడకపోతే కొంపలు ముంగిపోవు అని అనిల్ అంటున్నారు.. మరి సినిమాలు చూడకపోతే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నిస్తూ ట్రోలింగ్ చేశారు. తర్వాత అనిల్ రావిపూడి వివరణ ఇవ్వడం.. తాను కూడా ఐపీఎల్ చూస్తానని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

తాజాగా అనిల్ రావిపూడి ఢీ షో గ్రాండ్ ఫినాలేకి అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. అనిల్ రావిపూడి హీరోలా వేదికపైకి ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆది సెటైర్లు మొదలయ్యాయి. ఏంటి రెండు సింహాల మధ్యలో నుంచి ఎంట్రీ ఇచ్చారు ? ఆ సింహానికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అంటూ బాలయ్యని ఉద్దేశిస్తూ హైపర్ ఆది అనిల్ రావిపూడిని భయపెట్టాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి.. కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫామెన్స్ ని ఎంజాయ్ చేశారు. విన్నర్‌ను అనౌన్స్ చేసే సమయంలో హైపర్ ఆది అన్నా ఒక్కసారి మియావ్ మియావ్ పిల్లి డైలాగ్ చెప్పారా అని అనిల్ రావిపూడిని చిరాకు పెట్టారు. మైక్ మడత పెట్టి.. అంటూ అనిల్ రావిపూడి ఫన్నీగా హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఫుల్ ఎపిసోడ్ మే 29న టెలికాస్ట్ కానుంది.

Similar News