యాంకర్ శ్యామల vs కుమారి ఆంటీ.. ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్

బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల వైసీపీ తరపున ప్రచారం చేస్తోన్న వీడియోలు, ఫొటోలు, స్పీచ్‌లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Update: 2024-05-10 12:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల వైసీపీ తరపున ప్రచారం చేస్తోన్న వీడియోలు, ఫొటోలు, స్పీచ్‌లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. అటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరపున కూడా అనేక మంది సెలబ్రెటీలు ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన కుమారి ఆంటీ కూడా గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడ పట్టణంలోని 32,31,25,21,24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేసింది. ‘మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము. అందులో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్‌లో రాము సేవ చేస్తున్నారు. నా స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉంది. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది. వెనిగండ్ల రాము గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను.’’ అంటూ కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్ కుమారి ఆంటీని యాంకర్ శ్యామలను కంపైర్ చేస్తూ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు. టీటీపీ వైపు కష్టం తెలిసిన సాధారణ గృహిణి.. సొంత ఊరు, రాష్ట్రం బాగుండాలని ప్రచారం చేసిన మంచి మనిషి కుమారి ఆంటీ.. టీడీపీకి జనబలం అంటూ కుమారి ఆంటీని పొగడగా.. వైఎస్‌ఆర్సీపీ వైపు అమ్ముడుబోయిన మహిళ.. ఖరీదైన కారు, విల్లా ఇస్తానంటే వచ్చి ప్రచారం చేసిన మహిళ శ్యామల ఆంటీ.. వైసీపీది ధనబలం. ధనం ఈ రోజు ఉంటది రేపు పోతది. గుణం బతికినంత కాలం ఉంటది.. సమాజ సేవ బతికినంత కాలం ఉంటది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News