నా మనసంతా వాటి పైనే.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కామెంట్స్

హిందీలో 'బూమ్‌' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కత్రినా కైఫ్‌ మన అందరికీ సుపరిచితమే.

Update: 2024-04-28 09:27 GMT

దిశ,సినిమా: హిందీలో 'బూమ్‌' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కత్రినా కైఫ్‌ మన అందరికీ సుపరిచితమే. తెలుగులో 'మల్లీశ్వరి' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించి బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.

అయితే ఆమె కెరీర్‌లో గెలుపు,ఓటమి లు ఉంటాయని, మంచి అవకాశాలను వదులుకోనని చెబుతున్నదీ క్యాట్‌. ఇకపోతే, నా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా , అలాగే ఎలాంటి కథలు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారో అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా. కొన్ని సినిమాల తర్వాత దర్శకనిర్మాతలతో అన్ని విషయాలపైనా చర్చించడం అలవాటు చేసుకుని నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇటీవల హాలీవుడ్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ చాన్స్‌ మిస్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఏదిఏమైనా నా మనసు మాత్రం సినిమాలపైనే ఉంటుంది.' అని చెప్పుకొచ్చింది కత్రినాకైఫ్‌.

Similar News