నాకు ప్రాణభయం ఉంది.. పోలీసులను ఆశ్రయించిన ‘Adipurush’ డైలాగ్ రైటర్

తనకు ప్రాణ భయం ఉందని ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా పోలీసులను ఆశ్రయించాడు.

Update: 2023-06-19 11:22 GMT

దిశ, వెబ్ డెస్క్:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే రూ.340 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని వివాదాలు వదలడం లేదు. పవిత్రమైన రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అసభ్యకరమైన డైలాగులు ఉన్నాయంటూ పలు హిందూ సంఘాలు, సినీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లాను చంపుతామంటూ క్షత్రియ కర్ని సేన నుంచి బెదిరింపులు వచ్చాయి. అలాగే మరికొందరు ఆగంతకులు ఫోన్ చేసి డైరెక్టర్ తో పాటు డైలాగ్ రైటర్ ను చంపుతామంటూ బెదిరించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణం భయం ఉందంటూ ముంతషీర్ ముంబైలో పోలీసు రక్షణ కోరాడు.

Also Read,,

పోలీసులను ఆశ్రయించిన ఆదిపురుష్ రచయిత

Tags:    

Similar News