ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని నటి ఆత్మహత్య

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

Update: 2024-04-28 12:48 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది మాత్రం ఏవో కారణాల వల్ల మృతి చెందుతూ కుటుంబాలను విషాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ భోజ్‌పురి నటి అమృతా పాండే తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అమృతా తన బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చాక శనివారం నాడు బీహార్‌లోని అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. దీంతో అది గమనించిన స్థానికులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే అమృతా చనిపోవడానికి ముందు తన వాట్సాప్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తతో తనకు మనస్పర్థలు రావడంతోనే చనిపోయిందేమో? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై అమృతా కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. ఆమె గత కొద్ది కాలంగా డిప్రెషన్‌లో ఉందని చెబుతుండటం గమనార్హం. దానికి ట్రీట్‌మెంట్ కూడా తీసుకోవాలనుకున్నట్లు వెల్లడించారు. ఇంతలోనే ఇలా శవమై కనిపించిందని చెప్పడంతో అమృతా మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News