మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో దారుణం..

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకివెళితే.. కల్వకుర్తి మండలం జీడిపల్లికి చెందిన మమత (27) మూడు రోజుల కింద జిల్లాలోని ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. డెలివరీ అయ్యాక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మమత వైద్యం వికటించి బుధవారం తెల్లవారుజామున చనిపోయింది. దీనికి వైద్యుల […]

Update: 2021-11-02 22:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి ఎదుట ఆందోళనకు దిగారు.

వివరాల్లోకివెళితే.. కల్వకుర్తి మండలం జీడిపల్లికి చెందిన మమత (27) మూడు రోజుల కింద జిల్లాలోని ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. డెలివరీ అయ్యాక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మమత వైద్యం వికటించి బుధవారం తెల్లవారుజామున చనిపోయింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.

Tags:    

Similar News