బీజేపీకి విరాళమివ్వండి.. దేశాన్ని బలోపేతం చేయండి..

దిశ, వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ శ్రేణులకు విరాళాలిమ్మని పిలుపునిచ్చాడు. స్వచ్చందంగా సూక్ష్మ విరాళాలు ఇవ్వవలసిందిగా అభ్యర్ధించారు. పార్టీకీ మైక్రో డెనేషన్స్ ద్వారా సహాయపడాలని కోరారు. తాను విరాళంగా ఇచ్చిన 1000 రూపాయల రసీదును ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దేశానికి మెదటి స్థానం ఇవ్వాలనేది తన అభిమతమని తెలిపారు. విరాళాలిచ్చి బీజేపీని బలోపేతం చేయడంలో సహాయపడమని కోరారు. బీజేపీకి చెందిన జేపీ నడ్డా కూడా తాను విరాళంగా ఇచ్చిన 1000 రూపాయల […]

Update: 2021-12-25 07:34 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ శ్రేణులకు విరాళాలిమ్మని పిలుపునిచ్చాడు. స్వచ్చందంగా సూక్ష్మ విరాళాలు ఇవ్వవలసిందిగా అభ్యర్ధించారు. పార్టీకీ మైక్రో డెనేషన్స్ ద్వారా సహాయపడాలని కోరారు. తాను విరాళంగా ఇచ్చిన 1000 రూపాయల రసీదును ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దేశానికి మెదటి స్థానం ఇవ్వాలనేది తన అభిమతమని తెలిపారు. విరాళాలిచ్చి బీజేపీని బలోపేతం చేయడంలో సహాయపడమని కోరారు.

బీజేపీకి చెందిన జేపీ నడ్డా కూడా తాను విరాళంగా ఇచ్చిన 1000 రూపాయల రసీదును పోస్ట్ చేశాడు. ఈ విరాళాలు 5 రూపాయల నుంచి 1000 వరకూ ఉంటాయని తెలిపాడు. నమో యాప్ ద్వారా డోనేషన్లు చేయవచ్చనన్నారు. డోనేషన్లు చేసిన వారు రెఫరల్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యులను, స్నేహితులను కనెక్ట్ చేసుకోవచ్చని వివరించాడు. మాజీ ప్రధాని వాజ్ పేయ్ జయంతి సందర్భంగా బీజేపీ ఈ డొనేషన్లను స్టార్ట్ చేసింది.

Tags:    

Similar News