ఈటలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల మాట్లాడేది ఒకటి.. చేసేది మరొకటి అన్నారు. ఈటల రాజేందర్ రాజకీయ సమాధిని ఆయనే కట్టుకున్నారని విమర్శించారు. ఆయనపై పార్టీ అధ్యక్షుడు ఏ చర్య కావాలంటే ఆ చర్య తీసుకుంటారని చెప్పుకొచ్చారు. 40ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకున్నట్లు ఈటల స్వయంగా ఒప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీజేపీతో కలిశాక ఈటల బహుజన వాదం, […]

Update: 2021-06-01 05:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల మాట్లాడేది ఒకటి.. చేసేది మరొకటి అన్నారు. ఈటల రాజేందర్ రాజకీయ సమాధిని ఆయనే కట్టుకున్నారని విమర్శించారు. ఆయనపై పార్టీ అధ్యక్షుడు ఏ చర్య కావాలంటే ఆ చర్య తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

40ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకున్నట్లు ఈటల స్వయంగా ఒప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీజేపీతో కలిశాక ఈటల బహుజన వాదం, వామపక్షవాదం ఎక్కడకు పోయిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను కలిశాను అంటున్న ఈటల ఎవరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ప్రశ్నించారు.

Tags:    

Similar News