లోకేశ్ ఒక వీధి రౌడీ.. ఎమ్మెల్యే రోజా ఫైర్

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై నగరి ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కుప్పం పర్యటనలో లోకేశ్ వీధిరౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా లోకేశ్ వ్యవహారశైలి ఉందన్నారు. కుప్పం అభివృద్ది పట్టని చంద్రబాబు, లోకేశ్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు కనీసం తాగునీరు కూడా అందించలేదన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేశామా అని అక్కడి ప్రజలు […]

Update: 2021-11-13 04:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై నగరి ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కుప్పం పర్యటనలో లోకేశ్ వీధిరౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా లోకేశ్ వ్యవహారశైలి ఉందన్నారు. కుప్పం అభివృద్ది పట్టని చంద్రబాబు, లోకేశ్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు కనీసం తాగునీరు కూడా అందించలేదన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేశామా అని అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కుప్పంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైసీపీని గెలిపిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టంకట్టారని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రోజా ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News