MIM పార్టీ అంటే డీజీపీకి భయం : ఎమ్మెల్యే రాజాసింగ్

దిశ, వెబ్‌డెస్క్ : గోషామహల్ బీజేపీ ఎమ్మె్ల్యే రాజాసింగ్ మరోసారి ఎంఐఎం పార్టీమీద సంచలన వ్యాఖ్యలు చేశారు. గో రక్షకులను చంపేందుకు ఎంఐఎం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్‌లో గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు గో రక్షకుడు సంజయ్ యత్నించగా, అతన్ని చంపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అంతేకాకుండా గోవులను తరలిస్తున్న సమయంలో గో రక్షకులు అడ్డొస్తే వారిని చంపాలని ఎంఐఎం వాళ్లు చెబుతున్నారన్నారు. ఎంఐఎం పార్టీ అంటే తెలంగాణ డీజేపీ మహేందర్ రెడ్డి భయపడుతున్నారని రాజాసింగ్ […]

Update: 2021-07-04 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గోషామహల్ బీజేపీ ఎమ్మె్ల్యే రాజాసింగ్ మరోసారి ఎంఐఎం పార్టీమీద సంచలన వ్యాఖ్యలు చేశారు. గో రక్షకులను చంపేందుకు ఎంఐఎం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్‌లో గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు గో రక్షకుడు సంజయ్ యత్నించగా, అతన్ని చంపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అంతేకాకుండా గోవులను తరలిస్తున్న సమయంలో గో రక్షకులు అడ్డొస్తే వారిని చంపాలని ఎంఐఎం వాళ్లు చెబుతున్నారన్నారు.

ఎంఐఎం పార్టీ అంటే తెలంగాణ డీజేపీ మహేందర్ రెడ్డి భయపడుతున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. సంజయ్‌పై హత్యాయత్నం చేసిన వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల తాము రోడ్డుపైకి వస్తే జరిగే పరిణామాలకు డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News