కరోనా బాధితులెవరూ ఇబ్బంది పడొద్దు : ఎమ్మెల్యే భగత్

దిశ నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిని స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కోవిడ్‌ వాక్సిన్‌, టెస్టుల కోసం వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజలందరూ తప్పని సరిగా వాక్సిన్ వేయించుకోవాలని, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌ వాడాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావొద్దని, ఇంట్లోనే […]

Update: 2021-05-09 01:29 GMT

దిశ నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిని స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కోవిడ్‌ వాక్సిన్‌, టెస్టుల కోసం వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజలందరూ తప్పని సరిగా వాక్సిన్ వేయించుకోవాలని, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌ వాడాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావొద్దని, ఇంట్లోనే ఉండి మహమ్మారిని జయించాలని పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్నా కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News