బీజేపీ పైసలిస్తే డ్యాన్స్ చేస్తాం: కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : వరద బాధిత కుటుంబాలకు తలా పాతిక వేల రూపాయల చొప్పున అందిస్తామని, పూర్తిగా కేంద్రం నుంచే నిధులు తెప్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నిజంగా ఆ మాటకే కట్టుబడి ఉండి పూర్తిగా కేంద్ర నిధులతో బాధిత కుటుంబాలకు తలా పాతిక వేల చొప్పున ఆర్థిక సాయం అందించగలిగితే దీపాలు వెలిగిస్తాం.. చప్పట్లూ కొడతామని, అవసరమైతే డ్యాన్సు కూడా చేస్తామన్నారు. బీఎన్ […]

Update: 2020-11-23 11:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వరద బాధిత కుటుంబాలకు తలా పాతిక వేల రూపాయల చొప్పున అందిస్తామని, పూర్తిగా కేంద్రం నుంచే నిధులు తెప్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నిజంగా ఆ మాటకే కట్టుబడి ఉండి పూర్తిగా కేంద్ర నిధులతో బాధిత కుటుంబాలకు తలా పాతిక వేల చొప్పున ఆర్థిక సాయం అందించగలిగితే దీపాలు వెలిగిస్తాం.. చప్పట్లూ కొడతామని, అవసరమైతే డ్యాన్సు కూడా చేస్తామన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నకు మద్దతుగా సోమవారం సాయంత్రం వనస్థలిపురంలోని రైతుబజార్ చౌరస్తా దగ్గర రోడ్‌షో నిర్వహించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News